Saturday, November 17, 2012

శోభన్ బాబు కోటీశ్వరుడు ఎలా అయ్యాడు?


శోభన్‌బాబు ప్రతిఒక్కరికీ ఒక్కో విషయంలో స్ఫూర్తి నిలిచిన వ్యక్తి. మహిళల దృష్టిలో ఓ మంచి భర్త, యువతుల దృష్టిలో మంచి అందగాడు, చెల్లెలి దృష్టిలో ఓ మంచి అన్న, అభిమానుల దృష్టిలో ఓ మంచి హీరో, పరిశ్రమ దృష్టిలో ఓ మంచి కళాకారుడు... వీళ్లందరి దృష్టిలో ఎలా జీవించాలో తెలిసిన మొనగాడు. 

పొదుపు, మదుపు రెండూ తెలిసిన అరుదైన సెలబ్రిటీ శోభన్‌బాబు. అడ్డదారులు తొక్కకుండానే కోట్లకు పడగలెత్తిన వ్యక్తి. ‘జనాభా ఎంత పెరిగినా పెరగనిది భూమి. దాన్ని కొను. నీ జీవితం మారిపోతుంది’ అని ఆయన చెప్పిన మాటలతోనే నేనింత వాణ్ణి అయ్యానని మురళీమోహన్ చెబుతుంటారు. అంతేకాదు, ‘టైమ్ ఈజ్ మనీ’ అని, దాన్ని మనవాళ్లకు ఆస్తులతో పాటు పంచాల్సిన విషయమని తోటి కళాకారులందరికీ చెప్పేవారు. 

తానలానే గడిపాడు. పొదుపు ఒక్కటే చాలదని, మదుపు కూడా చాలా అవసరమని అనేవారు. అలాగే రియల్‌ఎస్టేట్‌లో దిగి ఎప్పటికప్పుడు స్థలాలు కొన్నారు. వాటిపై భవనాలు కట్టి, ఆ ఆదాయంతో మళ్లీ స్థలాలు కొనేవారు. ఇలా మద్రాసులో ఆయనకు చాలా భవనాలున్నాయి. 

No comments:

Post a Comment